అన్‌స్టాపబుల్-2 దూసుకొస్తోంది… మొదటి షో వియ్యంకులదే, ఇదిగో క్లారిటీ!

అన్‌స్టాపబుల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది నందమూరి బాలయ్య. అవును, బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షో ఈమాదిరి హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ సీజన్ ముగియగా త్వరలో అన్‌స్టాపబుల్‌-2 స్టార్ట్ అవ్వబోతోంది. దీనికి ఫస్ట్‌ గెస్ట్‌గా మాజీ ముఖ్యమంత్రి, TDP అధినేత చంద్రబాబు రాబోతున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదట అదంతా వట్టి పుకారు అనుకున్నారు. కానీ దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వియ్యంకులు మీటింగ్ కన్ఫర్మ్ అని అర్ధం అయిపోయింది.

కాగా ఆసక్తికరమైన క్వశ్చన్స్‌తో గెస్ట్‌లను తికమక పెట్టే బాలయ్య… తన వియ్యంకుడు, పార్టీ అధినేతను ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగి ఉంటుంది? పార్టీతో పాటు చంద్రబాబు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారా? ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్‌ పేరుతో ఆనాటి అంశాలు తెరపైకి వచ్చాయి. వాటిని ఏమైనా టచ్ చేసి ఉంటారా? భవిష్యత్‌లో పార్టీలో జరగబోయే మార్పులు గురించి అడిగి ఉంటారా? అనే ప్రశ్నలు బాలయ్య అభిమానులు, నారావారి అభిమానుల మదిలో మెదులుతున్నాయి.

కాగా సెకండ్‌ సీజన్ ప్రారంభవుతోందని ప్రోమో వచ్చినప్పటి నుంచి గెస్ట్ ఎవరనే ఆసక్తి అందరిలో ఉండేది. ఇంత వరకు గెస్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రోమోగానీ, ప్రకటన గానీ ఏది రాలేదు. కానీ సోషల్ మీడియాలో చంద్రబాబు, బాలకృష్ణ కలిసి ఉన్న ఫొటో ఒకటి వైరల్‌ మాత్రం అవుతోంది. దీంతో తొలి గెస్ట్ చంద్రబాబు అని అందరికీ అర్ధం అయిపోయింది. దాంతో ఈ షోపైన ఆటోమేటిక్ గానే హైప్ వచ్చేసింది.