ప్రముఖ రాజకీయ నాయకుడు వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఒక మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ గురించి తన అనుబంధం గురించి కూడా తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.
వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ కేవలం తన స్వయంకృషితోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి పైకి ఎదిగారని ఎవరు కూడా ఎన్టీఆర్ కి ఏ విధమైనటువంటి సపోర్ట్ చేయలేదని తెలియజేశారు. ఎన్టీఆర్ కు అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయి కానీ అవన్నీ చెబితే ఆయన అభిమానులు సైతం ఎవరు కూడా నిద్రపోరని తెలియజేశారు. ఎన్టీఆర్ వివాహంతో సహా, తన జీవితంలో జరిగిన ఎలాంటి విషయాలకైనా ఎవరికి ఎలాంటి పాత్ర లేదని తెలియజేశారు వల్లభనేని వంశీ. కేవలం 2009వ సంవత్సరంలో ఎన్టీఆర్ ను టిడిపి పార్టీ తరఫున ప్రచారం కోసం వాడుకొని వదిలేసారని తెలియజేశారు. అదృష్టవశాత్తు ఎన్టీఆర్ అక్కడ నుంచి బయటకు వచ్చారని తెలిపారు.
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూ ఉన్నారని తెలిపారు వంశీ. అమరావతికి జూనియర్ ఎన్టీఆర్ ను ప్రతి సమస్యలో కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు అది కరెక్ట్ నే అనే ప్రశ్న వంశీకి ఎదురవ్వగా.. అందుకు వంశీ ఎన్టీఆర్ ఎదగడం వారి కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదని.. అందుచేతనే ప్రతి సమస్యలో కూడా ఎన్టీఆర్ ని లాగుతూ ఉంటారని తెలియజేశారు.
ఎన్టీఆర్ ని ఎదగనివ్వకుండా తొక్కేస్తూ ఉంటారని గతంలో కూడా ఎంతోమంది తెలియజేశారని తెలిపారు వంశీ.అంతేకాకుండా దత్తపుత్రుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలియజేశారు. కేవలం ప్రశ్నించడానికి జనసేన పార్టీ పెట్టానని అది తప్ప మిగతా పనులన్నీ చేస్తున్నారని వంశీ తెలిపారు.