ఈ మధ్యకాలంలో ఎక్కువగా పురాణాల ఇతిహాసాల కథలనే ప్రతి ఇండస్ట్రీలో సినిమాలను తెరకెక్కిస్తు ఉన్నారు. వ్యాస మహాముని విరచిత మహాభారతాన్ని మహాభారత్ పేరుతో మెగా సీరియల్ గా బీ.ఆర్ చోప్రా రూపొందించారు 94 ఎపిసోడ్లుగా సాగిన ఈ సీరియల్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా టెలివిజన్ చరిత్రలోనే అత్యంత పాపులారిటీ సొంతం చేసుకున్న సీరియల్గా రికార్డ్ సాధించిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత ఎన్నో సీరియల్స్, సినిమాలు వచ్చిన కూడా మహాభారత్ రామాయణాన్ని మరిపించలేకపోతున్నాయని చెప్పవచ్చు. మళ్లీ ఇన్ని రోజులకు రామాయణ గాధ నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించడం జరుగుతోంది.
ఇందులో హీరోయిన్ల కృతిసనన్, రావణుడుగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తూ ఉన్నారు. దీంతో ప్రభాస్ అభిమానుల సైతం తమ హీరోని ఎలా చూపించబోతున్నారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా విడుదలైన టీజర్ ని చూసి అభిమానుల కోరిక ఒక్కసారిగా తలకిందులైంది చెప్పవచ్చు. ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేదని టీజర్ పై పలువురు అభిమానులు, నేటిజెన్లు కామెంట్స్ చేయడం జరిగింది.
ముఖ్యంగా ప్రభాస్ రాముడు గా చూపించిన తీరు హనుమంతుడి పాత్ర లక్ష్మణుడి పాత్ర రావణాసురుడి పాత్ర ఇలా అన్ని షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ అలా ఉన్న తాజాగా ఆది పురుష్ చిత్ర బృందం మరొక బ్లెండర్ కి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. టీజర్ తో అసహనాన్ని వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులకు మరొకసారి ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సినిమా రన్ టైం 3 గంటల 16 నిమిషాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతరం టైం ప్రేక్షకులను థియేటర్లో ఉంచగలవా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.