స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప1 పాన్ ఇండియా లెవ్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఎవరు అనుకోని విధంగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు. డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాని రెండు పార్టీలుగా తెరకెక్కిస్తారని ముందే చెప్పాడు.
పుష్ప1 సూపర్ హిట్ అవడంతో. పుష్ప2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని సుకుమార్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప2 కోసం సుకుమార్ పార్ట్ 1 లో ఉన్న క్యారెక్టర్ లనే కాకుండా.. కొత్త నటీమణులను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.. ఇందుకోసం బాలీవుడ్- కోలీవుడ్ నటులను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం.
పార్ట్ 1లో హీరోయిన్గా చేసిన రష్మిక పార్ట్2లో కూడా కొనసాగుంది. రష్మిక తో పాటు ఇంకో హీరోయిన్ ని యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అంటు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సుకుమార్ సాయి పల్లవికి తన క్యారెక్టర్ గురించి చెప్పాడని అమె ఓకే అన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. సుకుమార్ ఇప్పటికే సాయి పల్లవికి తన క్యారెక్టర్ గురించి చెప్పారని ఇంప్రెస్ అయిన సాయి పల్లవి అయితే తాజాగాఈ చిత్రం మేకర్స్ సాయి పల్లవి పుష్ప 2 లో లేదని క్లారిటీ ఇచ్చారు.అంతేకాదు పుష్ప2 కచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరి చూడాలి పుష్ప 2 ఏ లెవెల్ లో హెట్ కొడుతుందో.