దక్షిణాది ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది నయనతార అతి తక్కువ సమయంలోనే ఇమే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా అత్యధిక పారితోషకం తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ వంటి ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తోంది. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ఈమె ప్రేమించి వివాహం చేసుకున్నది.ప్రస్తుతం వీరిద్దరూ విదేశాలలో తమ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా నయనతార కు సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే త్వరలోనే నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అని వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. గత కొన్ని రోజులుగా నయనతార తన సంపాదన మొత్తాన్ని ఇతర రంగాలలో పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. అలా రెండు చేతుల తన సంపాదనను సంపాదిస్తూ ఉంది నయనతార. ఇక అంతే కాకుండా తన భర్త విగ్నేష్ తో కలిసి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నది.
ఇక ఈ క్రమంలోనే తను నటనకు స్వస్తి చెప్పి వ్యాపార రంగం వైపు స్థిరపడాలని ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం నిర్మాతగా మరికొన్ని సినిమాలను నిర్మించేందుకు ఆమె ఇష్టపడుతున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి నయనతార ఈ విషయంపై స్పందిస్తే బాగుంటుంది అని ఆమె అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నయనతార అభిమానులు సైతం కాస్త నిరుత్సాహానికి చెందారని చెప్పవచ్చు