తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. ఇక వారిలో ఎంతోమంది స్టార్ హీరోలుగా కూడా ఎదిగారు. అలాంటి వారిలో బాలయ్య బాబు కూడా ఒకరు.. బాలయ్య బాబు నటించిన సుల్తాన్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ దాగి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాకు తెలుసుకుందాం.సుల్తాన్ సినిమాలో ఏకంగా కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి వారు ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రం నిర్మాణ దశలోనే మంచి హైప్ ను క్రియేట్ చేసుకుంది. ఇక నటుల నటనను దెబ్బతీయకుండా నటుల ఇమేజ్ కి ఎలాంటి భంగం కలగకుండా ఈ సినిమాను తీయడం అంటే అది చాలా కష్టమని చెప్పవచ్చు.. అయితే డైరెక్టర్ శరత్ రైటర్ పరుచూరి బ్రదర్స్ ఇలాంటి సాహసమే చేశారని చెప్పవచ్చు. ఈ ముగ్గురు హీరోలతో సినిమా చేయడం వలన డైరెక్టర్ బాగానే పేరు పొందారు. ఇక బాలయ్యతో బాలగోపాలుడు సినిమాను నిర్మించిన MVR ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. నందమూరి తారక రామారావు తో కలిసి కృష్ణ ఐదు సినిమాలలో నటించారు. ఆ తర్వాత కృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ వంటి వారితో కూడా నటించారు.
ఇక కృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, కృష్ణంరాజు పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటించారు. మొదట ఈ పాత్రల కోసం కృష్ణ బాలయ్యను సంప్రదించగా వారు నిర్మాణము లేకుండా ఈ సినిమాను ఒప్పుకోవడంతో షూటింగ్ మొదలుపెట్టారు. ఇక ఇందులో కీలకమైన పాత్ర కోసం కీలకమైన నటుడు నటిస్తే బాగుంటుంది అని అందరూ భావిస్తూ ఉండగా.. దాంతో కృష్ణంరాజుని సంప్రదించారు అయితే కృష్ణంరాజు కూడా ఈ సినిమాకి ఓకే చెప్పారు. అయితే బాలకృష్ణ సీనియర్లు అనే గౌరవంతో వారి సన్నివేశాలను ముందు తీయించి ఆ తర్వాత తన సన్నివేశాలను నెమ్మదిగా షూటింగ్ చేయించారు.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు . ఇక అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ కోసం అండమాన్ కి వెళ్లగా అక్కడ తమ కుటుంబంతో హాజరయ్యారు ముగ్గురు హీరోలు. ఇక అక్కడ తినడానికి వండిపెట్టింది విజయనిర్మల.. ఇక సముద్రంలో బాలయ్య కూడా చేపలు పట్టి పులుసు పెట్టి అక్కడ ఉన్న వారందరికీ వడ్డించారు దీంతో అక్కడున్న వారంతా బాలయ్య గౌరవానికి మంత్ర ముగ్ధులు అయ్యారు.