పవిత్ర లోకేష్ – నరేష్ బంధం పై ఆ నటి ఘాటు కామెంట్స్..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవిత్రలోకేష్ – నరేష్ బంధం పై ఎప్పటికప్పుడు రకరకాల వార్తల వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి బంధం పై రోజుకో వార్థ పుట్టుకొస్తుంది. మొన్నటి వరకు పవిత్ర లోకేష్ , నరేష్ బంధానికి సూపర్ స్టార్ కృష్ణ సపోర్టు కూడా ఉందనే వార్త వైరల్ అవుతూ ఉండగా.. ఆ విషయంపై కృష్ణ క్లారిటీ ఇచ్చారు.ఇక నిన్నటికి నిన్న పవిత్ర లోకేష్ .. నరేష్ తో సహజీవనం చేయాలి అంటే నరేష్ నెలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, ఇక ఆమెను కాదని ఇంకొక అమ్మాయిని వెతుక్కుంటే భరణం కింద పవిత్ర లోకేష్ కు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలనే ఒప్పందం కూడా ఉంది అని .. ఇక ఈ ఒప్పందం కిందనే వారు సహజీవనం చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.Pavithra Lokesh lodges complaint against 'stalkers'ఇక ఈ విషయంపై ఇప్పటికే టాలీవుడ్ లో ఉండే పలువురు సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందించడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా మిర్చి మాధవి కూడా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. మిర్చి మాధవి ఎన్నో సినిమాల ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మిర్చి మాధవి.. ఇంటర్వ్యూలో భాగంగానే మిర్చి మాధవి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి.. అందులో నేను నా పర్సనల్ మేకప్ మ్యాన్ ను నాతో పాటు తీసుకువెళ్తాను. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ప్రొడ్యూసర్ల గురించి ఆలోచించి పారితోషకం విషయంలో అలాగే తమతో పాటు తీసుకువెళ్లే వారి ఖర్చుల విషయంలో కూడా కాస్త ఆలోచించాలి అంటూ చెప్పుకొచ్చింది.Mirchi Madhavi ఈ నటి కి కొందరు ఫోన్ చేసి నీచంగా మాట్లాడారట..

అంతేకాదు ఆమె మాట్లాడుతూ.. నా విషయంలో ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అని భావించే నాకు శతమానం భవతి సినిమా సమయంలో ఒక ఫ్రెండ్ డిఫరెంట్ గా బిహేవ్ చేశారు.. గేలి చేయడం వెకిలి చేష్టలు చేయడం లాంటివి చేయడంతో నాకు నచ్చలేదు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక అంతే కాదు నరేష్ పవిత్రాల బంధం పై కూడా ఆమె స్పందించి.. వారిద్దరి బంధం పై మనం ఏవిధంగా జడ్జ్ చేయగలము.. ముఖ్యంగా వారిద్దరూ కూడా మేజర్స్.. వారి జీవితాలను వారి వ్యక్తిగత విషయాలను అంత హ్యూమిలేట్ చేయడం మంచిది కాదు అంటూ మిర్చి మాధవి తెలిపింది.Mirchi Madhavi movies, photos and other details | Clapnumber

ఇక సినీ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే చాలామంది ఎన్నో వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. కానీ వీరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇక నరేష్ పవిత్రాల మధ్య ఏముందో వాళ్లకు తెలుసు ..వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్లకే తెలుసు.. మనం ఎందుకు మధ్యలో తల దూర్చడం.. వారినే టార్గెట్ చేయవలసిన అవసరం ఏముంది అంటూ ఘాటుగా స్పందించింది మిర్చి మాధవి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.