భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడటానికి రెడీగా ఉన్నాడు. యూఏఈ వేదికగా ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్తో ఆడే మ్యాచ్ కోహ్లీకి వందో టీ 20 మ్యాచ్. ఈ మ్యాచ్కు ముందు కింగ్ కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు తాను రెగ్యులర్ గా ఆడే తన ఎంఆర్ఫ్ జీనియస్ బ్యాట్ను కోహ్లీ పక్కన పెట్టేస్తున్నాడు.
ఈ బ్యాట్ ప్లేస్లో ఇకపై కోహ్లి ఎంఆర్ఫ్ గోల్డ్ విజార్డ్ బ్యాట్తో మ్యాచ్ ఆడతాడు. కోహ్లి గత కొంత కాలంగా ఫామ్లో లేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కోహ్లీ ఇంటర్నేషనల్గా సెంచరీ చేసి మూడేళ్లు అవుతోంది. కొంత కాలం విశ్రాంతి తర్వాత ఇప్పుడు కోహ్లీ ఆసియాకప్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కోహ్లీ కొత్త బ్యాట్ తో అయినా ఫామ్లోకి వస్తాడేమో ? చూడాలి.