ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం సీతారామం..యుద్ధం తో రాసిన మంచి ప్రేమ కథ సారాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మొదటిసారిగా నేరుగా మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక మొదటిసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నిజానికి ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ద కాలం దాటిపోయిందని చెప్పవచ్చు.ఇకపోతే సీతారామం సినిమాలో మృణాల్ ఠాగూర్ కంటే ముందుగా సీత పాత్ర రష్మిక మందన్నకు వచ్చింది కానీ ఆమె కరోనా బారిన పడడంతో ఆమె పాత్ర కాస్త మృణాల్ ఠాగూర్ కు వరించిందని చెప్పవచ్చు. ఇక అలా ఈ సినిమాతోనే ఆమె భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే 2012లో ఈమె బాలీవుడ్లో మొదటిసారి ముజ్ సే కుచ్ కెహతి ఏ ఖామోషియన్ అనే హిందీ సీరియల్ ద్వారా హిందీ బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2014లో వచ్చిన మరాఠీ సినిమా విట్టి దండు అనే సినిమా ద్వారా హీరోయిన్గా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ మంచి క్రేజ్ లభించడంతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక అలా మొత్తం హిందీలో 12 సినిమాలలో నటించి.. తన కెరియర్ పట్ల తాను చాలా సంతృప్తిగా ఉన్నానంటూ వెల్లడించింది. ఇకపోతే సినిమాల ద్వారా ఎంత ఆస్తి కూడబెట్టింది అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇక అసలు విషయానికి వస్తే.. మృణాల్ ఠాగూర్ ఆస్తి విలువ సుమారుగా రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇక ఈమె దగ్గర రూ.30 లక్షల విలువచేసే టయోటా కారు కూడా ఉంది.ఈమె సీరియల్ లో నటిస్తే రోజుకు 80 వేల రూపాయలు , ఒక యాడ్ కోసం పనిచేసే ఒక లక్ష రూపాయలను పారితోషకంగా తీసుకుంటుంది. ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటుంది.