మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణలోని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. నుపూర్ శర్మ ఎపిసోడ్ దెబ్బకు పార్టీ హైకమాండ్ వెంటనే రాజాసింగ్పై చర్యలు తీసుకుంది. రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్ను తొలగించింది. రాజాసింగ్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
అయితే రాజాసింగ్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఎమ్మెల్యే విడుదల చేసిన వీడియోపై మైనార్టీలు తీవ్రమైన ఆందోళనలు చేశారు. ఆ వీడియోను కూడా యూట్యూబ్ నుంచి పోలీసులు తొలలగించారు. ఇక సెప్టెంబర్ 2 లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం రాజాసింగ్ను వివరణ కోరింది.