ఇండియాలోనే టాలీవుడ్ కు అరుదైన ఘనత.. టాప్ 10లో మూడు సినిమాలు

కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్ధితి పూర్తిగా దిగజారిపోయింది. అన్ని రంగాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయాయి. అన్ని పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులను కూడా తొలగించాయి. అయితే ఇప్పుడిప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండటంతో కంపెనీలు మళ్లీ తమ వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. దీంతో ఆర్థిక పరిస్ధితులు మళ్లీ కుదుట పడుతున్నాయి. అలాగే సినిమా రంగం కూడా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడింది. అయితే లాక్ డౌన్ తర్వాత కొలుకుంటోంది.

తాజాగా 2022 సంవత్సరంలో ఇప్పటివరకు ఇండియాలో విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 1 సినిమా పేర్లను ట్రేడ్ వర్గాలు బయటపెట్టాయి. అందులో కన్నడ హీరో యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించి కేజీఎఫ్2 అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక నెంబర్ 2 స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది. ఇక మూడో స్థానంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్, నాలుగో స్థానంలో కశ్మీర్ ఫైల్స్, ఐదో స్థానంలో భూల్ భులయ్యా 2ఉంది.

ఇక పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ పదో స్థానంలో ఉండగా.. మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కారువారి పాట కలెక్షన్ల పరంగా 8వ స్థానంలో నలించింది. టాప్ లో తెలుగు సినిమాలు మూడు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ రూ.902.10 కోట్లు వసూల్ చేయగా. సర్కారువారిపాట రూ.155.60 కోట్లు, భీమ్లా నాయక్ రూ.132.90 కోట్లు వసూలు చేసింది. సర్కారువారి పాట సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా భారీగానే రాబట్టిందని దీనిని బట్టి తెలుస్తోంది.