మన గతం మరిచిపోతే ఎలా..ఆకట్టుకుంటున్న “ధ్యాంక్యూ” ట్రైలర్..!!

అక్కినేని హీరో నాగ చైతన్య ఈ మధ్య కాలంలో ఆచి తూచి సినిమా కధలను ఎంపిక చేసుకుంటున్నాడు. బంగార్రాజు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఇప్పుడు..”ధ్యాంక్యూ” సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. మనం లాంటి సూపర్ హిట్ సినిమా ని తెరకెక్కించిన డైరెక్టర్ విక్రమ్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించడం..ఓ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాలో నాగచైతన్య మనం ఇది వరకు ఎప్పుడు చూడని..ఓ సరికొత్త రోల్ లో చూడబోతున్నాం.

 

ఈ సినిమాలో నాగచైతన్య ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందాల తార రాశీ ఖన్నా, హాట్ బ్యూటీ మాళవికా నాయర్‌ ..చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్..హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని దిల్‌ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో..మేకర్స్ ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసారు.

ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్ అయిన..టీజర్, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది. కాగా, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. “మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్‌తోసినిమా కే హైలెట్ గా నిలిచింది. సినిమా మొత్తం ..లవ్‌ ఫీల్‌తో ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది అంటూ సినీ ప్రముఖులు సైతం..మెచ్చుకుంటున్నారు. ‘మనం’ తర్వాత విక్రమ్ కె. కుమార్, నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం తో ‘థ్యాంక్యూ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.