ప్రభాస్ మరో సంచలనం..ప్రాజెక్ట్ K కోసం ఏకంగా 8 కోట్ల కెమెరా..!!

ప్రభాస్..ఇప్పుడు ఈ పేరు కు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. మహా మహా బడా బాలీవుడ్ ప్రముఖ హీరోలు సైతం..ప్రభాస్ రేంజ్, క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్.. చూసి దిమ్మ తిరిగిపోతుంది. దీనంతటి కారణం బాహుబలి సినిమానే అని చెప్పక తప్పదు. ఈ సినిమా కారణంగానే ప్రభాస్..పాపులర్ అయ్యాడు. ప్రజెంట్ ఈ హీరో సినిమా అన్ని పాన్ ఇండియా లెవల్ లో నే రిలీజ్ అవుతున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ K..సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అయితే, తాజాగా ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా గురించి ఓ మైండ్ బ్లోయింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మహానటి సినిమా లాంటి వండర్ ఫుల్ సినిమాని తెరకెక్కించిన నాగ్ అశ్విన్..ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సినిమానే..ఈ ప్రాజెక్ట్ K. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..దీపికా పదుకునే నటిస్తుంది.

కాగా, ఈ సినిమా కోసం ఇప్పటి వరకు తెలుగు లో ఏ హీరో చేయని..ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన్నట్లు తెలుస్తుంది. ప్రాజెక్ట్ K కోసం.. ఏకంగా రూ.8 కోట్లు పెట్టి కెమెరాను తీసుకొచ్చారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఇమేజ్ పదింతలు పెరిగేలా ఎలివేషన్స్‌కు తోడు యాక్షన్ సీన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ సినిమాలో కీలకమైన షాట్స్ కోసం ఈ ఆరీ అలెక్సా 65 నే వాడుతున్నారట . అయితే ఈ కెమెరా వాడుకుంటున్న తొలి ఇండియన్ సినిమా ప్రాజెక్ట్ కే గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. .