బడా వ్యాపారితో నాగార్జున హీరోయిన్ ఎఫైర్‌… చివ‌ర‌కు ఏమైందంటే..!

బేసిగ్గా గ్లామర్ పరిశ్రమ అంటేనే మాయ. ఇక్కడ ఏకోద్ది మందో బాగా సెటిల్ అవుతారు. మిగతా వారి పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంటుందనేది నిర్వివాదాంశం. అందులోనూ సినిమా పరిశ్రమకి హీరోయిన్ కావాలనుకునే వచ్చేవాళ్లు దుస్థితి వేరే చెప్పాల్సిన పని లేదు. చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు చాలా విషయాలలో కాంప్రమైజ్ అయితే తప్ప అవకాశాలు వారిని తొంగి చూడవు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని సినిమా ఉద్దండుల మాట.

ఆ హీరోయిన్ ఈవిడే..!
కాస్త వెనక్కి వెళితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ జాబితాలో నటి కస్తూరి శంకర్ పేరు వినబడుతుంది. అదేనండి, నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాలో రెండవ హీరోయిన్ గా నటించినది ఈవిడే. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడిందట. అరకొర అవకాశాలు తప్పితే పెద్ద పెద్ద బేనర్లో ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయట. ఇక నాగార్జున ‘అన్నమయ్య’ సినిమాలో చేసినప్పటికీ ఆ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో ఆ సినిమాలో కస్తూరి ఉందనే విషయం ఎవరూ గుర్తు పెట్టలేదట.

రాగా రాగా వచ్చిన ఆ అవకాశం కూడా ఆమెకి పెద్దగా హెల్ప్ కాలేదట. దాంతో ఆమె సెకండ్ ఆప్షన్ తీసుకుందని ఓ పుకారు ఉండేది. తాజాగా ఆమె ఓ ప్రముఖ బిజినెస్ మాన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడిన ఆమె యాంకర్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. “ఓ 70 సంవత్సరాలు పైబడిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో తనకు ఎఫైర్ ఉందని వార్తలు రావడం చాలా బాధాకరం.

ఆ సో కాల్డ్ ప్రముఖ వ్యాపారవేత్తని కలిసినప్పుడు మేము జస్ట్ మాట్లాడుకున్నాము. దాన్ని మీ మీడియావాళ్లు ఏదో క్రియేట్ చేసి నానా రచ్చ చేస్తున్నారు. బేసిగ్గా ఇక్కడ నేను కొంతమందికి వ్యక్తిగతంగా నచ్చకపోవడం వల్లే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.” అని స్పష్టం చేసింది కస్తూరి. అయితే ఆ ప్రముఖ వ్యాపారవేత్త ఎవరనే విషయం మాత్రం నటి కస్తూరి ప్రేక్షకులకు తెలియజేయలేదు.