లైగర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్..వీడియో వైరల్..!!

హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా వచ్చేనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఒకేసారి అన్ని భాషలలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార భాగంలో చిత్ర బృందం బాగా దూకుడును పెంచింది. ఇక అంతే కాకుండా ముంబైలో కూడా లోకల్ ట్రైన్లో అనన్య పాండే విజయ్ దేవరకొండ కలిసి సినిమా ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ ఛార్మి తన ట్విట్టర్ నుంచి లైగర్ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది అని తెలియజేసింది.

ఇక ఈ రోజున కొన్ని నిమిషాల ముందు లైగర్ సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ గా మారుతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మాట సరిగ్గా రాని నత్తివాడిగా నటిస్తూ కనిపిస్తారు .ఇక వ్యక్తిగత జీవితంలో కూడా సవాలను ఎదుర్కొని ఫైటరుగా ఎదిగేందుకు ఏం చేశాడన్నదే ఈ సినిమా కథాంశం అన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ రమ్యకృష్ణ కూడా విజయ్ దేవరకొండ కి తల్లి పాత్రలో అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ఇక బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక లైగర్ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా తెరకెక్కించారు డైరెక్టర్ పూరి జగన్నాథ్.

ఇక లైగర్ సినిమా తరువాత తన తదుపరిచిత్రాన్ని విజయ్ దేవరకొండ ఒక రొమాంటిక్ కామెడీ సినిమాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నది. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో జనగణమన అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటిస్తున్నది. ప్రస్తుతం లైగర్ సినిమా నుంచి విడుదలైన ఈ పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమా విజయ్ అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి.