పాపం…సోము-కన్నా ఏదో ట్రై చేస్తున్నారు!

ఏపీలో బీజేపీ పరిస్తితి దారుణంగా ఉందనే సంగతి తెలిసిందే. ఇంకా ఆ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్తితి కనబడటం లేదు. ఏపీకి సరైన న్యాయం చేయడంలో విఫలమైన బీజేపీని జనం పెద్దగా నమ్మడం లేదు. అయితే ఎలాగోలా బీజేపీని పైకి లేపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టిగానే ట్రై చేస్తున్నారు. తనదైన శైలిలో పోరాటాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. కానీ ఎంత చేసిన ఉపయోగం ఉండటం లేదు..ఏపీలో బీజేపీకి ఆదరణ పెరగడం లేదు.

దీంతో సోము రూట్ మార్చారు…బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో సోము…అమరావతి కోసం పోరాటం చేయడం మొదలుపెట్టారు. జగన్ మూడు రాజధానులు ప్రకటించినప్పుడు బీజేపీ నేతలు పెద్దగా స్పందించలేదు..అలాగే వీర్రాజు అధ్యక్షుడుగా అయ్యాక…అమరావతి మద్ధతుగా ఏ బీజేపీ నేత మాట్లాడినా..వారిపై వేటు వేసేవారు. ఇలా అమరావతికి యాంటీగా ముందుకెళ్లిన వీర్రాజు..ఇప్పుడు బీజేపీ పెద్దల ఆదేశాలతో..అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలు అమరావతికి మద్ధతుగా ముందుకొచ్చి…ర్యాలీలు చేయడం చేశారు. ఇప్పుడు ఏకంగా వీర్రాజు..అమరావతిలోని గ్రామాల్లో పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్రలో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పాల్గొంటున్నారు. అయితే ఇలా పాదయాత్ర చేస్తున్న సరే…అమరావతి ప్రజల మద్ధతు బీజేపీకి దక్కడం లేదు. పైగా ఎక్కడకక్కడ నిలదీతలు ఎదురవుతున్నాయి.

జగన్, మీరు తోడు దొంగలు అని, అమరావతిని నాశనం చేస్తున్నారని సోముని రైతులు నిలదీసే పరిస్తితి ఉంది. అటు కన్నా ఏమో.. జగన్‌కు చెపుతున్నా…ఇప్పటికైనా రెండేళ్లలో రాజధాని అమరావతిలో ఉంటుందని చెప్పి అభివృద్ది చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే అమరావతి ప్రజల మద్ధతు పొందడానికి ట్రై చేస్తున్నారు గాని…పెద్దగా వారి ప్లాన్ మాత్రం వర్కౌట్ అవ్వడం లేదు. రాష్ట్రంలో ఎలాగో ఆదరణ ఉండటం లేదు…కనీసం అమరావతిలోనైనా ఉంటుంది అనుకుంటే..అది కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. మొత్తానికి సోము-కన్నా కష్టం వృధా అవుతుంది.