సర్కారు వారి పాట.. ట్రైలర్‌లోనే చెప్పేస్తారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’పై ఇప్పటికే ఇండస్ట్రీలో ఎలాంటి బజ్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో మనకు ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ చిత్రంపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

అయితే ఈ సినిమా ట్రైలర్‌ను మే2న భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో, అందరి చూపుల ప్రస్తుతం ఈ ట్రైలర్‌‌పైనే ఉన్నాయి. మహేష్ అల్ట్రా స్టైలిష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ ట్రైలర్‌ను కట్ చేసినట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ ట్రైలర్‌లో సినిమా కథను మనకు అర్థమయ్యే విధంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్‌ను కూడా మనకు ఈ ట్రైలర్‌లో రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి ట్రైలర్ కట్‌ను మహేష్ బాబు కెరీర్‌లో ఇప్పటివరకు చూడలేదని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని, ఆయన తన స్టైల్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తారని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మే 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.