మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెప్పుతుంటే కళ్ల ముందు ఆయన కొట్టిన ఫోర్లు , సిక్స్లు..గుర్తు వస్తాయి. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ధోనీ కి ఓ ప్రత్యేకమైఅన్ స్ధానం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై కింగ్స్ టీమ్ను లీడ్ చేస్తున్న ఆయన.. క్రికెట్తో పాటు కమర్షియల్ యాడ్స్లో నటీస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇన్నాళ్ళు స్టేడియంలో తన సత్త చాటిన ఈ క్రికెటర్.. ఇప్పుడు.. సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారట.
తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం ..ధోనీ ఓ ప్రోడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయబోతున్నారట. ఈ క్రమంలోనే ఆయన నిర్మాత గా మారి..బోర్ కొడుతున్న రోటీన్ కంటెంట్లను మార్చి..జనాలకు సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే విధంగా సినిమా కధలను చూస్ చేసుకుంటున్నారంటూ ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఇప్పటికే ఓ సినిమా స్టోరీని విని ఫైనల్ చేసి..హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. తన అందచందాలతో .. అటూ టాలీవుడ్, ఇటు కోలీవుడ్ ప్రజలను మైమరపించిన లేడీ సూపర్ స్టార్ నయన తార తో ధోనీ ఓ సినిమా నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
సినీ ఇండస్ట్రీకి కొత్త అయిన ధోనీ..మూవీ నిర్మాణ రంగంలో సినిమా కథలను ఎలా ఎంపిక చేసుకోవాలి..? ప్రొడక్షన్ వ్యవహారాలను..ఇతర ఇతర విషయాలను ఎలా చూసుకోవాలనే దానిపై ఇప్పటికే ధోని ఓ టీమ్ను ఏర్పాటు చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రోడ్యూసర్ గా ధోనికి ఇది ఫస్ట్ మూవీ..ప్రమోట్ చేసుకోకపోతే బెడిసికొడుతుంది. అయితే, నయన తార సినిమా ప్రమోషన్స్ కే రాను అంటూ ఓ కండీషన్ పెట్టుకుంది కదా..ఇప్పుడు ధోనీ కోసం ఆ లిమిట్స్ ని క్రాస్ చేస్తుందా..లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరి చూడాలి దీని పై ధోని అఫిషీయల్ ప్రకటన ఎప్పుడు ఇస్తారో..?