జగన్ జబర్దస్త్ ప్లాన్.. రోజమ్మ బుక్కైపోయారే..!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ , వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆమె రాజకీయ ఫ్యాన్స్ హ్యాపీ గానే ఉన్నా..సినీ ఫ్యాన్స్ మాత్రం డిస్సపాయింట్ అయ్యారు. మనకు తెలిసిందే రోజా ఓ పక్క బుల్లితెర పై పలు షోలకు జడ్జీ గా వ్యవహరిస్తూనే ,.. మరో వైపు సినిమాలు..ఇంకో వైపు రాజకీయాలు మ్యానేజ్ చేస్తూ.. కెరీర్ ని ముందుకు కొనసాగిస్తూ వచ్చింది.

కాగా, ఆమె ఎప్పటినుండి వేయి కళ్లతో వేచి చూసిన మంత్రి పదవి రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రి వర్గంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. ఈసారి సీఎం జగన్ బీసీలు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే..ఎటువంటి సిఫార్స్లు పట్టించుకోకుండా మంత్రి పదవలు ఇచ్చారని వైసీపీ నాయకులు చెప్పుకొస్తున్నారు.

అయితే, మంత్రి గా తన బాధయతలు 100% చేయాలి..తనను నమ్మి గెలిపించిన ప్రజలకు పూర్తి న్యాయం చేయాలని..రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక పై ఆమె సినిమాలు కానీ, ఇతర ఏ ప్రోగ్రామ్ షూటింగ్ లు కానీ చేయను అని మీడియా ముఖంగానే చెప్పుకొచ్చారు. అయితే, దీని పై రాజకీయ వర్గాలు మరోలా ప్రచారం చేస్తున్నారు. జగన్ ముందే రోజా కి ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చాడని.. మంత్రి పదవి వచ్చాక ఆ జబర్దస్థ్ షోలు అంటూ తైతక్కలు ఆడితే సహించేదే లేదు అని.. టంగ్ కూడా కంట్రోల్ లో పెట్టుకుని.. జనాలను మెప్పించి..మళ్ళీ నీ పదవీ కాపాడుకో అని హెచ్చరించారట. అందుకే ఈ విషయంలో ముందేపక్క ప్లాన్ తో ఉన్న రోజా.. మల్లెమాల వాళ్లతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని..ఆమె ప్లేస్ లోకి సీనియర్ సుందరిమణులు వచ్చేలా ప్లాన్ చేశారంటూ ఓ వార్త మీడియా లో వైరల్ గా మారింది. ఏది ఏమైనా జగన్ జబర్దస్థ్ ప్లాన్ తో రోజా చిక్కుల్లో పడిందనేది వాస్తవం అంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు.