న‌మ్ర‌త‌తో మ‌హేష్ సీక్రెట్ పెళ్లికి అస‌లు కార‌ణం ఇదే..!

వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్‌గా మారిపోతున్నాడు మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలలో అడుగు పెట్టిన మహేష్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోతున్నాడు. కమర్షియల్ యాడ్స్‌లో బాలీవుడ్ హీరోలతో కలిసి నటిస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్నా కుటుంబం విషయంలో చాలా పద్ధతిగా ఉంటారు. తండ్రి కృష్ణతోనే కాకుండా అన్నయ్య రమేష్ బాబుతో కలిసి సినిమాల్లో నటించిన ఘనత ఆయన సొంతం. ఇంట్లో ఆయనను అందరూ నాని అని ముద్దుగా పిలుచుకుంటుంటారు.

తల్లి ఇందిర, అక్క మంజుల అంటే అతడికి ఎంతో ఇష్టం. వారిద్దరూ కూడా అతడిని ఇప్పటికీ ఎంతో గారాబం చేస్తుంటారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రి కృష్ణతో సినిమాలలో నటించినా, 1999లో రాజకుమారుడు సినిమా ద్వారా సోలో హీరోగా మహేష్ సినీ కెరీర్‌ను మొదలు పెట్టాడు. మొదటి సినిమాతోనే ఎంతో ఆకట్టుకున్నాడు. ఇక పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుని సూపర్ స్టార్ అయ్యారు. ఇంత క్రేజ్ వచ్చినా, చాలా సింపుల్‌గా ఉండడం మహేష్‌కే సాధ్యం.

షూటింగ్ కంప్లీట్ అవగానే ఇంటికి వెళిపోతుంటారు. భార్య, పిల్లలతో గడపడం ఆయనకు ఎంతో ఇష్టం. తరచూ వారితో విదేశాలకు టూర్ వెళ్తుంటారాయన. అందుకే టాలీవుడ్‌లో ఫ్యామిలీ మేన్ అనే పేరు తెచ్చుకున్నారు. ఇక రాజకుమారుడు సినిమా తర్వాత మహేష్ ఎవరిని పెళ్లి చేసుకుంటారా అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. మహేష్ చేసుకునే అమ్మాయి ఎవరో అని ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు సాగేవి. అయితే ఆయన అందరికీ షాక్ ఇచ్చారు. 2000 సంవత్సరంలో నమ్రతతో వంశీ సినిమా చేశాడు.

ఆ సమయంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అయితే ఐదేళ్ల పాటు వీరి ప్రేమ వ్యవహారం అత్యంత సీక్రెట్‌గా ఉంచాడు. ఇక 2005లో చెన్నైలో మహేష్, నమ్రత చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో తండ్రి కృష్ణ వీరి వివాహానికి ఒప్పుకోలేదని ప్రచారం సాగింది. అయితే అదంతా అవాస్తవమని తర్వాత కాలంలో తేలింది.