కరీనా..నువ్వు ఇకనైనా మారేనా..?

ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లైతే అమ్మాయిలకు ఫ్యాషన్ పిచ్చి బాగా పట్టుకుంది. గర్ల్స్ దగ్గర నుండి ముసలి వాళ్ల వరకు..అందరూ ఫ్యాషన్ మోజులో పడిపోయారు. పెళ్లి కానీ అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ లతో చంపేస్తుంటే పెళ్ళైన ఆడవాళ్ళు..తమ పసుపు కుంకాలను సైతం లెక్క చేయకుండా ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ ఫారిన్ కల్చర్ ని అలవాటు చేసుకుంటున్నారు. మనకు తెలిసిందే..పెళ్లైన ఆడవాళ్లకి బొట్టు గాజులు పూలు ఎంత విలువైనవో.

ఆడవాళ్లకు నిజమైన ఆభరణం అదే. కానీ కొందరు ఫ్యాషన్ మోజులో దాని మర్చిపోతున్నారు. మనం బాగా గమన్నించిన్నట్లైతే ఈ మధ్య కాలంలో ఆడవాళ్లు చేతికి గాజులు..నుదట బొట్టు పెట్టు కోవడం మానేశారు. కుంకుమ పెట్టుకుంటే రాషస్ వస్తున్నాయని.. గాజులు వేసుకుంటే టైప్ చేయలేకపోతున్నామని చెత్త రీజన్స్ చెప్పుతూ..మన సాంప్రదాయలను మట్టిలో కలిపేస్తున్నారు. దీనికి హీరోయిన్స్ కూడా మినహాయింపు కాదు. ఇలాంటి వ్యవహారంతోనే బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్..చిక్కుల్లో పడింది.

మనకు తెలిసిందే కరీనా కు ఉన్న క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి. అమ్మడు కి పలు బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా మలబార్ గోల్డ్ కు ఓ యాడ్ చేసింది. యాడ్ చాలా బాగుంది. అందంగా ఉంది కరీనా..కానీ, ఓ స్త్రీ కి ముఖ్యమైన బొట్టు మాత్రం లేదు. పెట్టుకోవడం మర్చిపోయిందో లేక.. కావాలనే పెట్టుకోళేదో తెలియదు కాని.. అందమైన మొహంలో బొట్టు లేకపోవడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంట్లో ఎలాగో బొట్టు పెట్టుకోరు. కనీసం ఇలాంటి యాడ్స్ చేసేటప్పుడైనా.. బొట్టు పెట్టుకోండి అంటూ తిట్టిపోస్తుంటే.. మరికొందరు ఏకంగా..బాయ్ కాట్ మలబార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కరీనా చేసింది తప్పే అంటున్నారు సినీ ప్రముఖులు కూడా.. మరి చుడాలి కరీనా ఇకనైనా మారి బొట్టు పెట్టుకుంటుందా లేదా అనేది..?