మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ ఏప్రిల్ 23న గ్రాండ్గా నిర్వహించేందుకు రెడీ అవుతోంది.
అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వా్ల్ హీరోయిన్గా నటిస్తోండగా, చరణ్ సరసన అందాల భామ పూజా హెగ్డే నటిస్తోంది.