యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఫస్ట్ వీకెండ్ వరకు ఏదోలా నెట్టుకు వచ్చినా సోమవారం నుంచి డ్రాఫ్ అయిపోయింది. మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రు. 151 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా నాలుగో రోజు నుంచి డ్రాప్ అయ్యింది. ఓవర్సీస్లో ఈ సినిమాను ఇప్పటికే కశ్మీర్ ఫైల్స్ సినిమా దాటేసింది. ఓవర్సీస్లో రాధేశ్యామ్ భారీ డ్రాపవుట్స్ చూపించింది. చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన కశ్మీర్ ఫైల్స్ అక్కడ రాధేశ్యామ్ను మించి మరీ దూసుకు పోతోంది.
ఇక బాలీవుడ్లో అయితే రాధేశ్యామ్ డిజాస్టర్ టాక్తో వెళుతోంది. సోమవారం ఈ సినిమా హిందీ బెల్డ్లో కేవలం రు 1.2 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా నార్త్లో రు. 15 కోట్ల షేర్ కూడా కొల్లగొట్టలేదు. ఎంత గ్రాండియర్ విజువల్స్ ఉన్నా కూడా సినిమా స్లో అన్న కంప్లెంట్ వచ్చేసింది. దీనికి తోడు బాలీవుడ్ వాళ్లు సినిమాను బాగా టార్గెట్ చేస్తూ నెగటివ్ ప్రచారం చేస్తున్నారు.
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోకు ఈ వసూళ్లు తీవ్రమైన డిజప్పాయింట్ అనే చెప్పాలి. అసలు ముందు నుంచే ఈ సినిమాకు బాలీవుడ్లో బజ్ లేదు. దీనికి తోడు నెగటివ్ టాక్ నేపథ్యంలో సినిమా వసూళ్లు కూడా అలాగే ఉన్నాయి. తమిళంలోనూ సినిమా డిజాస్టర్ టాక్తోనే వెళుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ నేపథ్య సంగీతం అందించారు.