వాళ్ల‌తో అంత టార్చ‌ర్ అనుభ‌వించా.. పూజా హెగ్డే సంచ‌ల‌నం..!

మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి జీవా సరసన మాస్క్ అనే సినిమా ద్వారా అడుగు పెట్టింది పూజా హెగ్డే. కానీ ఈ సినిమాతో ఈమెకు ఎక్కడ గుర్తింపు రాలేదు కానీ ఆ తర్వాత నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. పొడుగు కాళ్ళ సుందరి గా అందం, అభినయం, పొడుగు ఇలా అన్ని లక్షణాలతో కలగలిసిన ఈ ముద్దుగుమ్మను చూసి ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.

ఇదిలా ఉండగా ఈమె స్టార్ హీరోల సరసన నటించి మంచి మంచి అవకాశాలను సంపాదించుకున్న తర్వాత ఇటీవల వచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈనెల 11వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే ఇంటర్వ్యూ ల వల్ల తనకు కలిగిన నష్టాలను తెలుపుతూ.. కొంతమంది వల్ల తన వ్యక్తిత్వం కోల్పోతోంది అంటూ కూడా ఆమె బాధ పడింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్వ్యూ కి వెళితే ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్ లు తీసే ఫోటోల వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నట్లు ఆమె తెలిపింది. అంతే కాదు ఎప్పుడైనా ప్రెస్ మీట్ లకు హాజరైతే చాలు ఫోటోగ్రాఫర్ ల వల్ల తెగ ఇబ్బంది పడుతున్నట్లు తన మనసులోని మాటలను బయట పెట్టింది పూజాహెగ్డే. అయితే ఆ మధ్య ఓ వేడుకకు హాజరైనప్పుడు ఆమెతో పాటు మరి కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా వచ్చారట‌.

ఈ క్రమంలో తన పక్కనే ఓ స్టార్ హీరో ఉన్నాడని దాంతో తన పాటికి తాను పక్కకు జరిగి వెళుతుండగా కొందరు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసి.. స్టార్ హీరో ని చూసి మొహం తిప్పుకొని పక్కకు వెళ్లిపోయిన పూజా హెగ్డే అని, అలాగే స్టార్ హీరో ని లెక్క చేయనటువంటి పూజా హెగ్డే అంటూ యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేశారని వాపోయింది. సాధారణంగా నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడను కానీ నన్ను ఎవరైనా పలకరిస్తే చాలా గౌరవ మర్యాదలతో వారిని పలకరిస్తాను .. కానీ ఇలాంటి కొంతమంది వల్ల వ్యక్తిత్వం కూడా కోల్పోతుంది అంటే ఆమె తీవ్రంగా బాధపడినట్లు అర్థ‌మ‌వుతోంది.