మహేష్ ఫ్యాన్స్‌కి షాకింగ్ సర్ప్రైజ్.. థ్రిల్ చేసిన నమ్రత..ఏంటో మీరే చూడండి..!!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకే కాదు..వాళ్ళ భార్యలకు కూడా అభిమానులు ఎక్కువే. మంచి క్రేజ్..భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లల్లో మహేష్ బాబు భార్య..నమ్రత కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసినా..పెళ్లైన తరువాత భర్త అనందంలోనే తన ప్రపంచాని చూసుకుంటూ..బిడ్డలకోసం తన ఇష్టాలను వదులుకుని మరీ పిల్లల ఇష్టాలినే తన ఇష్టంగా మార్చుకున్న తెలుగింటి ఇల్లాలు.

మహేష్ బాబు భార్య చాలా సైలెంట్ ..ఆయనకు తగ్గ జోడీ అనే చెప్పాలి. తన పని తాను చేసుకుంటూ .. వచ్చిన పని చూసుకుంటూ ..లేనిపోని వివాదాలకు వెళ్ళదు. స్టార్ హీరో భార్య కదా..ఒకప్పుడు హీరోయిన్ ని కదా నేను అంటూ ఎక్స్ పోజింగ్ చేసే డ్రెసులు వేయదు. ఎప్పుడు కూడా నిండైన వస్తాధారణ తోనే కనిపిస్తుంది. అందుకే మహేష్ అభిమానులకు ఆమె అంటే గౌరవం.

సినిమాలకు దూరమైన నమ్రత సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను..లేదా భర్త,పిల్లల గురించిన మ్యాటర్స్..ఫన్నీ వీడియోస్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా అభిమానులకు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. మనకు తెలిసిన విషయమే మహేష్, ఆయన తండ్రి కృష్ణ వేరు వేరుగా ఉంటారు అని. ఇక వారంలో ఓ సారి మాత్రం ఖచ్చితంగా ఆయనను కలిసి..భోజనం చేసి వస్తారు. ఇక రీసెంట్ గా దానికి సంబంధించిన ఫోటోను అభిమానులతో పంచుకుంది నమ్రత. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ, సితార, గౌతమ్ ఉన్న ఫోటోను నమ్రత షేర్ చేస్తూ…”మామయ్య గారు నుండి ఎంతో నేర్చుకోవచ్చు. మేం అంతా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోను ఘట్టమనేని అభిమానులు చూసి ఫిదా అవుతున్నారు. కానీ ఈ ఫోటోలో మహేష్ బాబు మాత్రం మిస్ అయ్యాడు. ఆ ఒక్క లోటు బాగా తెలుస్తుంది.