దయచేసి ఈ సినిమాను మర్చిపోమ‌ని ప్రాధేయ‌ప‌డుతోన్న ఎన్టీఆర్‌..!

ఎన్టీఆర్ తన సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడమే కాకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన నటించిన సినిమాలలో అన్నీ కూడా మంచి విజయాన్ని సాధించినా .. ఒక్క శక్తి సినిమాను మినహాయిస్తే.. అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన శక్తి సినిమాను ఏకంగా 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ నిర్మాతలకు మాత్రం కేవలం 20 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసి ఇక 25 కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చింది ఈ సినిమా.

ఎన్టీఆర్ మాత్రమే కాదు ఎన్టీఆర్ అభిమానులు కూడా పూర్తిస్థాయిలో నిరాశ చెందారు. మ‌గ‌ధీర రికార్డుల‌ను టార్గెట్‌గా చేసుకుని వ‌చ్చిన ఈ సినిమా ఘోరంగా ప్లాప్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా గురించి ఎన్టీఆర్ ఎప్పుడూ ఎక్కడ పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఇక ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ యూట్యూబర్ భువన్ కుమార్ టిటూ టాక్స్ ప్రోగ్రాంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ముచ్చటించడం జరిగింది.

భువన్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన శక్తి సినిమా అంటే తనకు ఇష్టమని చెప్పాడు.. అప్పుడు ఎన్టీఆర్ నా సినిమాలో శక్తి సినిమా తప్ప మరే సినిమా నువ్వు చూడలేదా అంటూ రివర్స్ లో ప్రశ్నించారు. ఇక ఈ సినిమా గురించి మర్చిపోవాలి అంటూ ఎన్టీఆర్ భువన్ కుమార్ ను వేడుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో రాజమౌళి ని మాన్ స్టర్ అని ఎందుకు పిలుస్తారో చెప్పాలని అడగగా ఎన్టీఆర్ డెవిల్ అని, అందుకే అవతలి వ్యక్తులకు అతడు మాన్ స్టర్ ల కనిపిస్తారని ఎన్టీఆర్ తెలిపాడు.

తర్వాత భువన్ కుమార్ రాజమౌళి ని ఉద్దేశించి కింగ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ప్రశంసించారు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ లెగసీ వల్ల డిసిప్లేన్ వస్తుందని చెప్పగా .. ఫ్లాప్ వచ్చిన సమయంలోనే లెగసీ గొప్పతనం తెలుస్తుంది అని ఎన్టీఆర్ అన్నారు. అయితే ఈ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.