ఆ ప్లాఫ్ డైరెక్టర్ కధతో శంకర్ ,రామ్ చరణ్ సినిమా ..!

రామ్ చరణ్,డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో లైకా ప్రొడక్షన్స్ లో సినిమా వస్తున్న సంగతి అందరకి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా పేరుతొ రాజమౌళి చేతులో చిక్కీకిపోయి ఎట్టకేలకు ఎన్టీఆర్ కొరటాల సినిమా లో , చరణ్ శంకర్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు . డైరెక్టర్ శంకర్ ఎప్పుడు తన సొంత కధలనే నమ్ముకుంటాడు . అవి ఈ మధ్య మిస్ ఫైర్ అవుతున్నాయి . అందుకే తన ఒరిజినల్ శైలికి భిన్నంగా వేరొక దర్శకుడు దగ్గర కధ తీసుకున్నాడు శంకర్.ఆ దర్శకుడు ఎవరో కాదు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు .

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ కధలో చరణ్ ముఖ్యమంత్రిగా గెలిచే ఐఏఎస్ ఆఫీసర్‌‌గా నటిస్తున్నాడు. అప్పట్లో సెన్సేషన్ క్రియేటివ్ చేసిన యాక్షన్ హీరో అర్జున్ హీరోగా వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకి ఇది సీక్వెల్ అనే టాక్ ఉంది. ఈ సినిమాలో కియా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే .ఈ స్టోరీ సంగతి కి వస్తే నీ దగ్గర ఏదైనా మంచి స్టోరీ ఉంటే ఇవ్వు, దానితో సినిమా తీయడానికి నాకేం అభ్యంతరం లేదు అని కార్తీక్‌ని శంకర్‌‌ అడిగాడట. దాంతో తాను ఎప్పుడో రాసుకున్న కథను శంకర్‌‌కి ఇచ్చేశాడు కార్తీక్. ఇప్పుడు రామ్‌చరణ్‌తో శంకర్‌‌ తీస్తున్నది అదే కథ. ఈ విషయాలన్నీ రీసెంట్‌ ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజే స్వయంగా చెప్పడంతో తెలిసింది. ఆ కథ చాలా బాగుంటుందని, దాన్ని శంకర్‌‌ తీస్తే మరింత బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇచ్చేశానని అంటున్నాడు కార్తీక్. పేట, జగమే తంత్రం లాంటి సినిమాలు తీసిన కార్తీక్ కథలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు.


Leave a Reply

*