అన్నయ్య కోసం 40 కోట్లు త్యాగం చేసిన జూనియర్ ఎన్టీఆర్?

రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.. సినిమా ఒప్పుకున్నప్పటినుంచి ఇంకే సినిమా వైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఒక రకంగా ఈ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ఈ నాలుగేళ్ల గ్యాప్ లో దాదాపు నాలుగు సినిమాలు చేసేవాడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే ఈ సినిమా మరోసారి వాయిదా పడడంతో ఇక త్రిబుల్ ఆర్ ని నమ్ముకుంటే కష్టమని భావించి ఇతర దర్శకులతో సినిమాకు రెడీ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇప్పటికే కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రెండోసారి సినిమా రాబోతూ ఉండడంతో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా విషయంలో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ 40 కోట్లు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కోసం త్యాగం చేశాడు అనేది తెలుస్తుంది. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు అని అనుకుంటున్నారా.. ఎన్టీఆర్తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కు కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆయన తో పాటు అటు ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా మరో నిర్మాత గా ఉండడం గమనార్హం.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో జై లవకుశ సినిమాకి కూడా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత గా ఉన్నారు.. ఇక అప్పట్లో కళ్యాణ్ రామ్ కి అనుకున్నంత లాభాలు రాలేదు అని చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు అన్నయ్య ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ పారితోషకం తీసుకోవడం లేదట. ఇప్పుడు ఒక్కో సినిమాకి 40 కోట్లు పారితోషికం తీసుకునే జూనియర్ ఎన్టీఆర్ మొత్తాన్ని త్యాగం చేశాడట. కానీ ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో షేర్ తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇలా చేయడం వల్ల సినిమా నిర్మాణం కూడా తక్కువ బడ్జెట్ లో పూర్తవుతుంది అని అనుకుంటున్నాడట జూనియర్ ఎన్టీఆర్.