లావణ్య త్రిపాఠి తో మెగా హీరో పెళ్లి … ఒక పోస్ట్ తో క్లారిటీ..!!

మెగా హీరో వరుణ్ తేజ్ బుధవారం కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పుట్టినరోజు నాడు మెగాహీరో 25 లక్షల రూపాయల విలువ చేసే డైమండ్ రింగ్ తీసుకుని బెంగళూర్ కి వెళ్తున్నాడు అని అక్కడ హీరోయిన్ లావణ్య త్రిపాటి తో తన ప్రేమను వ్యక్తపరిచబోతున్నాడు అనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. ఇకపోతే లావణ్య త్రిపాఠి తనపై వస్తున్న ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టడానికి ఒక పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..

మెగా హీరో వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాటి ప్రేమలో ఉన్నారు .. డేటింగ్ కూడా చేసుకుంటున్నారు.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే వార్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు లావణ్య మెగా ఫ్యామిలీ లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఆ ఫంక్షన్ కు హాజరు అవుతూ ఉండడం.. ముఖ్యంగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లిలో అన్ని తానే అయ్యి దగ్గరుండి చూసుకోవడంతో త్వరలోనే మెగా వారి ఇంటికి కోడలిగా వెళ్లబోతోంది అనే వార్తలు కూడా వినిపించాయి.

అయితే నిహారిక తన స్నేహితురాలు కాబట్టి ప్రతి చిన్న ఫంక్షన్ కు వెళ్తున్నాను అని ఆమె అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది. కానీ ఏ ఒక్కరూ కూడా ఆమె మాటలను నమ్మలేదు. వరుణ్ తేజ్ కోసం మాత్రమే ఆమె అక్కడికి వెళ్తోంది అనే వార్తలు మళ్ళీ ప్రచారం చేశారు. ఏమైందో తెలియదు గాని కొద్ది కాలం పాటు వీరి పై వస్తున్న రూమర్లకు పులిస్టాప్ పెట్టారు నెటిజన్స్.. ఇకపోతే జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు నాడు కూడా వస్తున్న వార్తలపై పరోక్షంగా లావణ్య త్రిపాటి పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం సొంతూరులో కుటుంబంతో ఉన్నట్లు చెప్పింది. డెహ్రాడూన్‌లో ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నట్లు పేర్కొంది.

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి రెండు సినిమాల్లో పనిచేశారు. ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి మెరిసింది. ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి.. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ తాను ఉత్తరాఖండ్‌లో ఉన్నట్లు లావణ్య క్లారిటీ ఇవ్వడంతో.. ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.