పేరుకే స్టార్ హీరోలు..ఆ విషయంలో నో ములాజ్..!!

కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ తాము వివాహం చేసుకోబోయే అమ్మాయి నుంచి కట్నం తీసుకుని మరీ వివాహాలు చేసుకుంటున్నారు.. ఇకపోతే సామాన్య ప్రజలు అయితే వారు తీసుకునే కట్నం కేవలం వేలు, లక్షల్లోనే ఉంటుంది.. కానీ సెలబ్రిటీలు అయితే ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను కట్నం కింద తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు..ఇకపోతే ఎవరెవరు తమ వివాహ వేడుకలకు ఎంత కట్నం తీసుకున్నారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.మహేష్ బాబు – నమ్రత:
వంశీ సినిమాతో పరిచయమైన వీరు ప్రేమించుకొని 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి కి కట్నంగా మహేష్ బాబు భార్య నమ్రత రూ.2000 కోట్ల రూపాయలను తీసుకువచ్చింది. అయితే ఒకానొక సమయంలో మహేష్ బాబు కష్టాల్లో ఉన్నాడని తెలిసి, ఏకంగా మరో రూ.250 కోట్లను ఆమె తన పుట్టింటి నుంచి తీసుకురావడం గమనార్హం.

2.కళ్యాణ్ రామ్ – స్వాతి :
నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్.. స్వాతి పెళ్లి నీ పెళ్లి చేసుకునేటప్పుడు వారి పెళ్లి కి కోటి రూపాయలు ఖర్చు కాగా , ఇక స్వాతి 30 కోట్ల రూపాయలను వరకట్నంగా తీసుకొచ్చింది.

3.అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి:
2011 సంవత్సరంలో రెడ్డి కుటుంబానికి చెందిన స్నేహా రెడ్డి ని ,అల్లు అర్జున్ వివాహం చేసుకున్నాడు. ఈమె ఏకంగా 110 కోట్ల రూపాయలను తన అత్త వారి ఇంటికి తీసుకు వచ్చింది. వీరి పెళ్లికి మొత్తం 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా.

4.రామ్ చరణ్ – ఉపాసన :
మెగా వారసుడిగా రామ్ చరణ్ అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలు అయిన ఉపాసన ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మీరు వివాహానికి దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇక వరకట్నం కింద ఉపాసన ఏకంగా 300 కోట్ల రూపాయల పైగా కట్నం రాంచరణ్ ఇంటికి తీసుకు వచ్చిందట. అంతేకాదు ఉపాసన కు సంబంధించిన వ్యాపార సామ్రాజ్యాలను కూడా రామ్ చరణ్ చూసుకుంటున్నారు.

5.ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి:
ఎన్టీఆర్ 2011 సంవత్సరం లక్ష్మీప్రణతిని వివాహం చేసుకున్నాడు. ఇక వీరి పెళ్లికి 18 కోట్ల రూపాయలు ఖర్చు కాగా, ఆమె వరకట్నం కింద ఇంటికి 200 కోట్ల రూపాయలను వరకట్నంగా తీసుకువచ్చింది