టాలీవుడ్లో యాంగ్రీ హీరో అని ఎవరైనా ఉంటె అది హీరో రాజశేఖర్ మాత్రమే .ఆయనకు పెత్యేకమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.అయితే ఈ టీవీ లో అలీ హోస్టు గా చేస్తున్న ‘అలీతో సరదాగా ‘ ప్రోగ్రాం చేస్తున్న సంగతి అందరకి తెలిసేందే.ఈసారి ఈ షోకి హీరో రాజశేఖర్ తో పాటు నటి జీవిత కూడా వచ్చారు . అయన కరోనా అనుభవం గురించి కమెడియన్ ఆలీ నిర్వహించే టాక్ షోలో రాజశేఖర్, ఆయన భార్య జీవిత మాట్లాడారు.
గత రెండేళ్ల వ్యవధిలో కరోనా వైరస్ దెబ్బకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పెద్ద నటులు చనిపోయారు . అందులో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా పలువురు వైరస్కు బలై అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తారు. కొందరు ఈ మహమ్మారి కారణంగా మృత్యు అంచుల దాకా వెళ్లి వచ్చారు. అందులో సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా ఒకరు.
ఆయనకు కరోనా సెకండ్ వెవ్ లో కరోనా సోకి దాదాపు నెల రోజులు పాటు ఐసీయూలో ఉండటం, ఒక దశలో పరిస్థితి అయన పరిస్థి విషమించడం మనందరికి తెలిసిందే.
అయితే అదృష్టవశాత్తూ ఆయన ఆ దశ నుంచి కోలుకుని మళ్లీ మామూలు మనిషి అయ్యారు. ఆ టైంలో తాను చనిపోతానని అనుకున్నట్లు రాజశేఖర్ చెప్పడం గమనార్హం. ఒక దశలో పరిస్థితి చేయి దాటిపోయిందని అనిపించిందని, ఇంకో మూడు రోజుల్లో తాను చనిపోతానని, తనను తీసుకెళ్లి తగలబెట్టేస్తారని అనుకున్నానని రాజశేఖర్ ఉద్వేగ స్వరంతో చెప్పారు. జీవిత మాట్లాడుతూ.. శేఖర్ సినిమా షూటింగ్ మొదలుపెడదాం అని అంతా ఏర్పాట్లు చేసుకున్న టైంలో రాజశేఖర్కు కరోనా సోకిందని, తర్వాత ఊహించని విధంగా పరిస్థితి విషమించి నెల రోజులు ఆయన ఐసీయూలో ఉండాల్సి వచ్చిందంటూ ఆ రోజులను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టేసుకున్నారు. కోలుకున్నాక ఆయన శేఖర్ అనే సినిమాలోనూ నటించారు. అది త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
.ఇంకా ఈ షోలో తమ కెరీర్ తొలి రోజుల గురించి, తమ ఇద్దరి తొలి కలయిక గురించి రాజశేఖర్, జీవిత మాట్లాడారు. సినిమాల్లోకి రాకముందు తనుకున్న నత్తి సమస్య గురించి కూడా రాజశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది .