కెరీర్ పీక్స్ లో ఉండగా చనిపోయిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా?

మరణం అనేది ఏ వ్యక్తికి ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం. యంగ్ ఏజ్ లో ఆయా కారణాలతో చనిపోతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాగే సినిమా తారలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఎంతో కష్టపడి సినిమా రంగంలో మంచి స్వింగ్ లో కొనసాగుతున్న సమయంలో కొందరిని మరణం తన వెంట తీసుకెళ్లింది. ఒత్తిడి తట్టుకోలేక కొందరు చనిపోతే, అనారోగ్య సమస్యలతో మరికొందరు చనిపోయారు. పలు రకాల ప్రమాదాలతో ఇంకొందరు కన్ను మూశారు. ఇంతకీ కెరీర్ పీక్స్ లో ఉండగా చినిపోయిన సినీ తారులు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తెలుగు సినిమా పరిశ్రమలో కొంత కాలం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఆర్తి అగర్వాల్ అనుకోకుండా కన్నుమూసింది. వెంకటేష్ తో జతకట్టి నువ్వునాకు నచ్చావ్ అనే సినిమా చేసింది ఆర్తి. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వచ్చింది. తరుణ్ తో కలిసి నువ్వులేక నేనులేను అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఈ అమ్మడు బరువు పెరిగింది. దాన్ని తగ్గించుకునేందుకు లైపో చేయించుకుంది. సర్జరీ వికటించడంతో తను 2015లో చనిపోయింది.

అటు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సౌందర్య కూడా అనుకోకుండా కన్నుమూసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందకు విమానంలో వెళ్తుండగా.. ప్రమాదం జరిగి చనిపోయింది. 2004లో బెంగళూరు నుంచి కరీంనగర్ వస్తుండగా ఈ విమానం కూలిపోయింది. అటు లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకున్నాడు. టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో ప్రత్యూష అనుమానాస్పద రీతిలో 2002లో చనిపోయింది. అటు రియల్ స్టార్ శ్రీహరి అనారోగ్యంతో 2013లో చనిపోయాడు. కమెడియన్ వేణుమాధవ్ సైతం క్యాన్సర్ తో కన్నుమూశాడు. అటు చక్రి గుండె పోటుతో 2014లో కన్నుమూశాడు. వీరితో పాటు యశోసాగర్, భరత్ కూడా అకాల మరణం పొందారు. వీరితో పాటు పలువురు నటులు కూడా అర్థాంతరంగా చనిపోయారు.