గత రెండు మూడు సంవత్సరాల నుంచి.. బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువగా యువ నటులనే వివాహం చేసుకుంటున్నారు. ఇక కరోనా సమయంలో కొంతమంది నటీనటుల అయితే వారికి సంబంధించిన సన్నిహితులు, బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉండే వారిని వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కత్రినా కైఫ్ కూడా యువ హీరో విక్కీ ను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా వీరి బాటలోనే మరొక బాలీవుడ్ జంట వివాహం చేసుకోబోతోందని సమాచారం.
అయితే ఇటీవల కాలంలో ఆలియాభట్, హీరో రణభీర్ కపూర్ చాలాకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు.. అయితే ఈ మధ్య కాలంలోనే వీరు అధికారికంగా ప్రకటించడం జరిగింది. కానీ వీరి వివాహం గురించి అడిగితే మాత్రం ఇద్దరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. అయితే 2022లో వీరి వివాహ ఖచ్చితంగా చేసుకోబోతున్నట్లు గా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇక వీరితో పాటుగా మరో ఒక యువ జంట కియారా అద్వాని, సిద్ధార్థ మల్హోత్రా వచ్చే యేడాది వివాహం చేసుకోబోతున్నారని వార్త బాగా పాపులర్ గా వినిపిస్తోంది. అందుకోసం మీరు ప్లానింగ్ ఇస్తున్నట్లుగా కూడా సమాచారం.