హార్దిక్ పాండ్యా ఇంకొందరు నన్ను బలవంతం చేశారు.. రియాజ్ భటి భార్య?

దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భటి భార్య రెహనుమా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేసింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, బులియన్ కింగ్ పృథ్వి రాజ్ కొఠారీలు తనపై అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు గల కారణం తన భర్త రియాజ్ అని వెల్లడించింది. వీరిపై ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 24న ఇచ్చారు.

రిజిస్టర్ తీసుకున్నప్పటి నుంచి ఆరోపణలపై విచారణ జరుపుతూ ఉన్నారు కానీ ఇటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని మీడియా ముందు వాపోతున్నారు. ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్న రియాజ్ భటి ఫై ఉన్న క్రిమినల్ రికార్డల్లో ఎక్సట్రా టార్షన్, ఫోర్జరీ, భూ అక్రమ కేసులు ఉన్నాయి . అంతేకాకుండా బార్స్ అండ్ రెస్టారెంట్ లలో ఓనర్ లను బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసే వాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కంప్లైంట్ లో ఆమె తన భర్త హార్దిక్ పాండ్యా కొందరితో కలిసి సెక్స్ చేయాలని బలవంతం చేశారని కంప్లైంట్ ఇచ్చింది. అలాగే హార్థిక్ పాండ్యా తో పాటు మరో ఇద్దరు స్నేహితులు మద్యం మత్తులో అసహజ శృంగారానికి కూడా పాల్పడ్డారని కంప్లైంట్ పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమీ లాభం లేదు అంటూ మీడియా ముందు వెల్లడించింది.