కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది.
గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కేసులు నమోదు కాగా.. అతి స్వల్పంగా కర్నూలు జిల్లాలో నాలుగు కేసులు నమోదు అయ్యాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 20,67,083 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,415 దగ్గర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 247 మంది కరోనా నుంచి విముక్తి పొందగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,49,582 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 3,086 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 32,630 కరోనా టెస్ట్లు నిర్వహించారు.