సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటులు ప్రేమించుకుని వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ప్రేమించుకుని నిశ్చితార్థం వరకు వచ్చి ఆ తర్వాత వివాహం చేసుకోకుండా ఆగిపోయిన జంటలు చాలానే ఉన్నాయి..ఇక వారీ గురించి ఇప్పుడు చూద్దాం.
1). మెహరీన్ -భవ్య బిష్ణోయ్:
గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు వీరిద్దరూ. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరు విడిపోయారు.
2). త్రిష-వరుణ్ మణియన్:
ఇక వీరిద్దరూ కూడా నిశ్చితార్థాన్ని చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. కానీ వీరు కూడా మనస్పర్థల వల్ల విడిపోయారు.
3). రష్మిక-రక్షిత్ శెట్టి:
ఈ జంట కూడా నిశ్చితార్థం వరకు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కానీ వీరిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ లేక విడిపోయారు.
4). నయనతార-ప్రభుదేవా:
వీరిద్దరూ పీకల్లోతులో ప్రేమలో ఉన్నప్పటికీ.. ప్రభుదేవా వల్ల ఈమె ఆస్తి అంతా పోగొట్టుకుని వార్తల్లోకి రావడంతో..చివరకు నయనతారకు ప్రభుదేవాకు మనస్పర్ధలు రావడం వల్ల విడిపోయారు.
5). అఖిల్-శ్రేయ భూపాల్:
నాగార్జున చిన్న కుమారుడు అఖిల్, ఒక బిజినెస్ మాన్ కూతురు శ్రేయ భూపాల్. వీరిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకొని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత వీరు కూడా విడిపోయారు.
6). హన్సిక-శింభు:
హీరోయిన్ హన్సిక, శింభు తో ప్రేమలో ఉన్నట్లు గా ఆ మధ్య వార్తలు వినిపించాయి. దానికి తోడు వీరు ఏ పార్టీలో చూసినా కనిపించేవారు. కానీ వీరు కూడా కొన్ని కారణాల చేత విడిపోయారు.
ఇక వీరే కాకుండా శృతిహాసన్ – మైకెల్ కోర్సులే, అంజలి-జై, నయనతార-శింబు, సమంత – సిద్దార్థ్ వంటి వారు కూడా విడిపోయారు.