నివేదా థామస్.. పరిచయం అవసరం లేని పేరు. మొదట మలయాళ, తమిళ్ చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ.. నాని హీరోగా తెరకెక్కిన `జెంటిల్ మేన్` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేదా.. `జై లవకుశ`తో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది.
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్లను అందుకుంది నివేదా. పైగా ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఈమె నటించి `వకీల్ సాబ్` చిత్రం సైతం భారీ హిట్గా నిలిచింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతాయని అందరూ భావించారు.
కానీ, వకీల్ సాబ్ హిట్ ఏ మాత్రం నివేదాకు కలిసిరాలేదు. ఆమె గ్రాఫ్ను వకీల్ సాబ్ ఏ మాత్రం లేపలేకపోయింది. దీంతో నివేదా సినీ కెరీర్ డైలామాలో పడినట్టైంది. ప్రస్తుతం ఈ భామ `శాకిని – ఢాకిని` అనే సినిమా చేస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతోంది.
అయితే ఈ సినిమా మినహా నివేదా చేతుల్లో మరే ప్రాజెక్టూ లేదు. మళ్లీ ఈమె పుంజుకోవాలంటే మరో స్టార్ హీరో సినిమాలో లేదా పెద్ద బ్యానర్లో అవకాశం రావాల్సిందే అని అంటున్నారు.