హలో..హలో..టైటిల్ చూసి ఖంగారు పడకండి. ఆఫరేషన్ అంటే మీరు అనుకున్నది కాదు..భారతదేశానికి సంబంధించిన అతి పెద్ద సీక్రెట్ ఆపరేషన్. పూర్తి విరాల్లోకి వెళ్తే.. రష్మిక మందన్నా `మిషన్ మజ్ను` అనే చిత్రం తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
పాకిస్తాన్లో భారతదేశ గూఢచార సంస్థ నిర్వహించిన కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. శాంతను బగ్చీ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ విడుదలకు తేదీ ఖరారు అయింది.
`వచ్చే ఏడాది మే 13న సినిమాని విడుదల చేస్తున్నాం. వాస్తవ ఘటనల స్ఫూర్తిగా తీసిన సినిమా ఇది` అని విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ విషయాన్నే రష్మిక కూడా తెలుపుతూ `ఆపరేషన్ని చూడ్డానికి రెడీగా ఉండండి` అంటూ కామెంట్ పెట్టింది.