దర్శకధీరుడు రాజమౌళి పరోక్షంగా ఓ నటుడి సినీ కెరీర్ను దారుణంగా నాశనం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం `మర్యాద రామన్న`. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఈ సినిమాలో `రామినీడు`గా భయంకరమైన రోల్ పోషించిన నటుడు నాగినీడు సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు.
అయితే ఈ సినిమాతో నాగినీడు భారీ క్రేజ్ను దక్కించుకున్నాడు కానీ.. ఆ తర్వాత ఆఫర్లు మాత్రం పొందలేకపోయాడట. సక్సెస్ కూడా మర్యాద రమన్నతోనే ఆగిపోయిందట. ఫోన్ చేసి ఆఫర్ల అడిగినా కూడా.. `నాగినీడుకు పాత్ర ఇస్తున్నామంటే.. దాని కంటూ ఓ స్థాయి ఉండాలి.. అది కేవలం నాగినీడు మాత్రమే చేయగలిగేదై ఉండాలి.. అలాంటి పాత్ర మేం రాయడం లేదు. రాసినప్పుడు చెబుతాం` అని అనేవారట.
అలా సినిమా అవకాశాలు ఏవీ రాక.. ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట. మొత్తానికి రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న చిత్రం నాగినీడుని ఓ స్థాయిలో నిలబెట్టింది. కానీ, అదే చివరకు ఆయన కెరీర్కు పెద్ద మైనస్గా మారింది.