తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో మోస్ట్ బ్యూటీ ఫుల్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది మానస్-ప్రియాంకల జంటే. ముఖ్యంగా ప్రియాంక తన ఆశలన్నీ మానస్పైనే పెట్టేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం లేచినప్పటి నుంచీ పడుకునే వరకు మానస్ చుట్టే తిరుగుతూ..అతడి జంపమే చేస్తోంది.
అయితే మానస్ మాత్రం ఆమెతో సేవలు చేయించుకుంటున్నాడు కానీ… ఆమెతో ఎంత వరకూ ఉండాలో అంతవరకే ఉంటున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో ప్రియాంక, మానస్లు పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రియాంకపై మానస్ తల్లి పద్మిని షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పద్మిని మాట్లాడుతూ.. `ప్రియాంక చాలా మంచి అమ్మాయి, నాకెంతో ఇష్టం. అయితే హౌస్లో మానస్కు ఎవరూ సెట్ కారు. నేను ఎవర్ని వేలు పెట్టి చూపిస్తే మానస్ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ప్రియాంక సింగ్.. నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోను. ఆమెకు తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేస్తా. అలా ప్రియాంకకు నేను సపోర్ట్ చేస్తాను, ఏదైనా సాయం చేస్తాను` అని చెప్పుకొచ్చింది.