మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్నాడో టాలీవుడ్ హీరో. ఇంతకీ ఆయన ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవితేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు: ఆన్ డ్యూటీ`. శరత్ మండవ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు మన ఈ ప్రభుత్వ అధికారి మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్నారు. అవును, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీ పాంత్రాల్లో జరుగుతోంది.
ఈ షెడ్యూల్లో రవితేజపై థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే సాంగ్స్ చిత్రీకరణ కోసం చిత్రబృందం విదేశాలకు వెళ్లబోతోంది. కాగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.