జబర్దస్త్ లో.. జడ్జి.. కంటిస్టెంట్ మధ్య గొడవ.. వీడియో వైరల్..!

జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ప్రసారం అవుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ షోలను బీట్ చేసే షో ఏది రాలేదు అని చెప్పుకోవచ్చు.ఇక ముఖ్యంగా ఈ షో లకి అట్రాక్షన్ గా ఇందులో జడ్జిలు, అందమైన యాంకర్ లు ఉండడం విశేషం. అయితే తాజాగా ఈ షో కు సంబంధించి ఒక ప్రోమో విడుదలైంది. ఇది నవంబర్ 5వ తేదీన టెలికాస్ట్ కానుంది.ఇందులో హైపర్ ఆది, శ్రీ గాలి సుదీర్, రష్మీ అనసూయ వంటివారు ఉన్నారు.

ఇక ఇదే షో లోనే రాకింగ్ రాకేష్ కూడా ఉన్నాడు. ఇక ఇందులో కిట్ అయిపోయిన తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అయితే జడ్జ్ మనో మాట్లాడుతూ”ఎంత గౌరవం నువ్వంటే రాకేష్”నాకు. ఏంటది.. పద్ధతేనా అసలు.. ఈ స్టేజ్ మీద మీరు చేస్తోంది ఏంటి అంటూ విరుచుకు పడ్డాడు. ఐ యామ్ సో సారీ అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు మనో.

ఇక రోజా ఎంత పిలిచినా కూడా మనో వినకుండా వెళ్ళిపోయారు. మనం వెళ్లకుండా అడ్డుకున్న రాకేష్ టీమ్ సభ్యులను.. పైకి వెళ్ళండి అంటూ కోపంగా చెయ్యి తో కొట్టబోయాడు. ఈ విషయం చూసిన అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.