ఎట్టకేలకు బ్యాచిలర్ సినిమాతో అన్ని కోట్లు సంపాదించిన అఖిల్..?

పూజా హెగ్డే, అఖిల్ కలిసి నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నిర్మాతగా అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి నిర్మించారు. మొదటి స్వామి నుంచి ఈ మూవీపై పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఈ సినిమా తాజాగా 50 కోట్ల క్లబ్ లో చేరి పోయింది. దీనికి సంబంధించి తాజాగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది డైరెక్టర్ భాస్కర్. ఇక అఖిల్ మూడు సినిమాల తర్వాత ఈ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాల సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.