చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను ఏ స్థాయిలో అతలా కుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన కరోనా.. ఫస్ట్ వేవ్లోనే కాకుండా సెకెండ్ వేవ్లోనూ ప్రజలను ముప్ప తిప్పలు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మెల్లగా కంట్రోల్ అవుతోంది.
గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 300 లోపుగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధికంగా కృష్ణ జిల్లాలో 34 కేసుల చప్పున నమోదు కాగా.. అతి స్వల్పంగా అనంతపురం జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 20,68,672 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో ఒకరు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,429 దగ్గర నిలిచింది. ఇక నిన్నొక్క రోజే 242 మంది కరోనా నుంచి విముక్తి పొందగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,52,084 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 2,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 26,119 కరోనా టెస్ట్లు నిర్వహించారు.