ఛార్మీ కౌర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 14 ఏళ్ల వయసులోనే `నీతోడు కావాలి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన ఈ భామ..`శ్రీ ఆంజనేయం` మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోవడమే కాదు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.
ఇక ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లేకపోవడంతో నటనకు గుడ్బై చెప్పేసిన ఛార్మి.. ప్రస్తుతం నిర్మాతగా సెటిల్ అయింది. యంగ్ హీరోల సినిమాలతో పాటుగా `లైగర్` వంటి పాన్ ఇండియా చిత్రాలు సైతం నిర్మిస్తోన్న ఛార్మి.. తొలి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. రూ.200.
అవును, నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. స్కూల్లో చదువుతున్నప్పుడు ఓ సినిమా కోసం జూనియర్ ఆర్టిస్టుగా చేసిందట. ఆ సినిమాలో చేసినందుకు రెండు వందలు ఇచ్చారట. అదే ఛార్మి ఫస్ట్ రెమ్యూనరేషన్ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.