భీమ్లా నాయక్‌కు కోత పడుతోందట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు. భీమ్లా నాయక్ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ ఇప్పటికే టాలీవుడ్‌లో ఫైర్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా పవన్ అపియరెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాను మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఈ సినిమా నిడివి ఏకంగా మూడు గంటలుగా ఉంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ సినిమా రన్‌టైమ్‌ను తగ్గించేందుకు సినిమా రచయిత త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ చిత్ర రన్‌టైమ్‌ను రెండున్నర గంటలుగా ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా లెంగ్తీగా అనిపించదని, వారు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో పవన్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, యంగ్ హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. పవన్ సరసన అందాల భామ నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.