నటసింహం నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు బ్రహ్మీణిని నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు లోకేష్ కి ఇచ్చి వివాహం జరిపించిన సంగతి తెలిసిందే. ఇక రెండో కూతురు తేజస్విని బాలయ్య మొదట ఓ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు నాగార్జున తనయుడు నాగ చైతన్యనే.
అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళు. అందుకే నాగ చైతన్య-తేజస్విలకు వివాహం జరిపించి నాగార్జున, బాలకృష్ణలు వియ్యంకులుగా అవుదామని అనుకున్నారట. ఇరు కుటుంబాలు ఒప్పందాలు సైతం చేసుకున్నారట. కానీ, అనూహ్యంగా చైతు లైఫ్లోకి సమంత వచ్చింది. దీంతో వారి ఒప్పందాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.
`ఏ మాయ చేశావే` సినిమాతో చైతు-సామ్లు ప్రేమలో పడటంతో.. బాలయ్య ఇక తన నిర్ణయాన్ని విరమించుకుని వైజాగ్ గీతం సమస్త కి చెందిన శ్రీ భరత్ కి తేజస్విని ఇచ్చి పెళ్లి చేశారు. అలా నాగ చైతన్య బాలయ్యకు అల్లుడు కాలేకపోయాడు. కాగా, దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న చై-సామ్లు 2017లో పెద్దలను ఒప్పించి గోవాలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకన్నారు.
అయితే ఎంతో అన్యోన్యంగా, అంతకుమించి చూడముచ్చటగా ఉండే ఈ జంట పెళ్లై నాలుగేళ్లు కాకుండానే.. తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేశారు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసార సాగర ప్రయాణానికి అనూహ్యంగా ఎండ్ కార్డు పడిపోయింది. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకుని అభిమానుకులకు బిగ్ షాక్ ఇచ్చారు.