అఖండ మూవీ..ఆ ఓటిటి సంస్థ సొంతం..!

బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్, నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ హక్కులను దక్కించుకున్నది వాటి వివరాలు చూద్దాం.

అఖండ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏ చిన్న వచ్చిన వీడియో వచ్చిన రికార్డులను సైతం కొల్లగొడుతుంది. తాజాగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. థియేటర్ లో విడుదలైన అనంతరం ఈ సినిమా ఓటిటీలో విడుదలకానుంది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ వహిస్తున్నాడు. ఈ సినిమాని తొందరగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు.

వారితో పాటు బాలకృష్ణ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేదా వేచిచూడాలి.