టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగచైతన్యతో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్న సామ్.. తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్ను దక్కించుకుంది.
గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఐఎఫ్ఎఫ్ఐ) కార్యక్రమానికి పాల్గొనేందుకు సమంతకు ఆహ్వానం అందింది. అవును, ఈ 52వ ఇఫీ ఫెస్టివల్లో సమంతని స్పీకర్గా పాల్గొనాల్సి ఉందని ఇన్వైట్ చేసింది. దీంతో ఇఫీ ఈవెంట్లో స్పీకర్గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటిగా సమంత రికార్డు సృష్టించడంతో.. ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో అయిపోతున్నారు.
ఇక ఇందులో వ్యాఖ్యాతగా సమంతతో పాటు మనోజ్ భాజ్పాయ్ కూడా ఎంపికయ్యారు. అలాగే వీరితో పాటు ప్రముఖ దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఇఫీ నుండి ఆహ్వానం అందింది. కాగా, 20న ప్రారంభమవుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 28 వరకు తొమ్మిది రోజులపాటు జరుగబోతుంది.