శ్రీవారి సన్నిధిలో దేవరకొండ?

టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అతని కుటుంబం తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. విఐపి బ్రేక్ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ అర్చకులు వారికి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలను ఇచ్చారు. విజయ్ దేవరకొండ తో పాటు తన తల్లి తండ్రి సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు.

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా సినిమా లో పాటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇటీవలే తన హైవే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. లైగర్ సినిమాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు, అందుకోసం వీసా ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ వెల్లడించారు.